Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపూజీ ఇల్లు కొనుగోలు రేసులో కీర్తి మీనన్

Webdunia
FILE
దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన ఇల్లును కొనుక్కునేందుకు ఆయన మునిమనుమరాలు కీర్తి మీనన్ కూడా రేసులో నిలిచారు. మహాత్ముడి ఇంటిని కొనేందుకు పలువురు ముందుకొచ్చినా, ఆయన కీర్తి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

జోహెన్నెస్‌బర్గ్‌లోని ఒచర్డ్ సబర్బన్‌లో ఉన్న బాపూజీ ఇంటిని, ఆ ఇంటి యజమాని నాన్సీ బాల్ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటిని కొనుగోలు చేసేందుకు కీర్తితో పాటు, మలేషియాకు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారనీ, వారితో చర్చలు జరుపుతున్నానని నాన్సీ బాల్ ప్రకటించారు.

భారత ప్రభుత్వం, పలువురు వ్యాపారవేత్తలు ఈ విషయంలో తనను సంప్రదించారనీ.. ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదని నాన్సీ బాల్ వెల్లడించారు. మహాత్ముడి అనుచరులుగా ఆయన జ్ఞాపకాలను పదిలపర్చాలన్నదే తమ అభిమతమని నాన్సీ అన్నారు.

మహాత్ముడి ఇంటికి 3.5 లక్షల డాలర్ల ధర పలుకుతుందని భావిస్తున్నట్లు నాన్సీ బాల్ పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల తాను కేప్‌టౌన్‌కు మారాలని నిర్ణయించుకోవడంతో ఈ ఇల్లు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందని ఆమె వివరించారు. కాగా... 1908-09 మధ్యకాలంలో బాపూజీ ఈ ఇంటిలో నివాసమున్నారని నాన్సీ తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments