Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో శివమొగ్గ వాసి పంట పండింది.. రూ.24 కోట్ల బంపర్ లాటరీ!

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:13 IST)
ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లిన శివమొగ్గ వాసికి అదృష్టం కలిసివచ్చింది. దుబాయ్ ప్రభుత్వం నిర్వహించే లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల బంపర్ లాటరీని గెలుచుకున్నాడు. ఈ అదృష్టవంతుడి పేరు శివమూర్తి కృష్ణప్ప. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతవాసి. 
 
ఈయన వృత్తిరీత్యా ఓ మెకానికల్ ఇంజినీరు. గత 15 ఏళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్నాడు. ఇటీవల కృష్ణప్ప కొనుగోలు చేసిన లాటరీ (నెంబరు 202511) టికెట్‌కు ప్రథమ బహుమతి లభించింది. ఈ టిక్కెట్‌ను గత నెల 17వ తేదీన కొనుగోలు చేశాడు. 
 
ఈ బహుమతి భారత కరెన్సీలో రూ.24 కోట్లకు పైగా ఉంటుందట. గత మూడేళ్లుగా ప్రతి నెలా లాటరీలు కొంటుంటే ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని కృష్ణప్ప పట్టరాని సంతోషంతో చెప్పాడు. 
 
కాగా, ఈసారి ఒకేసారి రెండు టికెట్లు కొనేందుకు నిర్వాహకులు అనుమతించడంతో తన అదృష్టం పండిందని తెలిపాడు. ఈ డబ్బుతో సొంతూర్లో ఓ ఇల్లు కట్టి, మిగతా డబ్బు పిల్లల చదువులు, వారి భవిష్యత్ కోసం దాచుకుంటానని ఆ ఇంజినీర్ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments