దేశాభివృద్ధిలో తెలుగు ఎన్నారైలు భాగస్వామ్యం కావాలి : ఎస్. విష్ణువర్థన్ రెడ్డి

Webdunia
శనివారం, 6 జులై 2019 (18:11 IST)
అమెరికాలో జరుగుతున్న తానా 22వ మహాసభల్లో అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికాలో స్థిరపడిన భారతీయులందరూ ప్రధానంగా తెలుగు వాళ్ళు భారతదేశం అభివృద్ధిలో, సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్య శిక్షణలో మీ సహకారాన్ని మరింత యవతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
అమెరికాలో తెలుగు పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం మీరుఅందరూ ప్రయత్నిస్తున్న తీరు మీ పిల్లలను తెలుగు భాషలో మాట్లాడడం, మీరు భాషను అదరుస్తున్న, అనుసరిస్తున్నవిధానం మాకు గొప్ప అనుభూతిని నింపిందన్నారు. ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు అవసరమైనటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. 
 
ఇక్కడ స్థిరపడిన అటువంటి అనేక మంది భారతీయులు తెలుగువారు, మీప్రతిభ కారణంగానే ఖండాంతరాలు దాటి మీరు అమెరికాలో ఉన్నతమైన స్థానాల్లో అనేకమంది ఉన్నారన్నారు. కాబట్టి భారతీయ యువతకు నైపుణ్య శిక్షణలో ఆర్థికాభివృద్ధిలో ఉద్యోగ కల్పనలో మీ వంతు సహకారం రాబోయే రోజుల్లో మరింతగా ఆంధ్రా, తెలంగాణాకు ఆశిస్తున్నట్టు చెప్పారు 
 
తానా మహాసభల్లో ప్రవాస భారతీయులు చూసిన తర్వాత ఒక విశ్వాసం కలుగుతుందని, నేడు అభివృద్ధి కావాలంటే రాజకీయ అధికారం చాలా కీలకంగా మారబోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలోగానీ దేశాభివృద్ధిలోగానీ మీసహకారం రోజురోజుకు పెరుగుతున్న సమయంలో అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఇందులో తెలుగువారు ముఖ్యంగా అమెరికా దేశంలో పలు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది కాబట్టి మరింతగా ఈరంగంలో మీభాగస్వామ్యం పెరగాల్సిన అవసరం  చాలా ఉంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

తర్వాతి కథనం
Show comments