స్వైన్ ఫ్లూ మహమ్మారికి ఎన్నారై బలి

Webdunia
FILE
భారత్‌లో రోజు రోజుకు విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ మహమ్మారికి... ఓ ప్రవాస భారతీయుడు బలయ్యాడు. అమెరికాలోని అట్లాంటా నుంచి పది రోజుల క్రిందట భారత్ వచ్చిన ప్రవీణ్ పటేల్ (43) అనే ఎన్నారై.. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్‌లో మరణించారు.

కాగా... ఆగస్టు నెల మూడవ తేదీన మహారాష్ట్రలోని పుణే నగరంలో రీదా షేక్ అనే 14 ఏళ్ల బాలిక స్వైన్ ఫ్లూ‌ దెబ్బకు బలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత గత శనివారం రోజున పుణేలోనే సంజయ్ తుకారాం కోక్రే (42) అనే ఉపాధ్యాయుడు, ముంబైలో నివసిస్తున్న ఫాహమిదా పాన్‌వాలా (53) అనే షుగర్ వ్యాధిగ్రస్తుడు కూడా స్వైన్ ఫ్లూ మహమ్మారికి బలయ్యారు.

ఆయా రాష్ట్రాలలో పదుల సంఖ్యలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతుండగా... ఈ వ్యాధి వల్ల మరణించిన వారిసంఖ్య ప్రస్తుతం మన దేశంలో నాలుగుకు చేరింది. తాజాగా మరో 82 కేసులు నమోదు అవటంతో.. పాజిటివ్‌ల సంఖ్య 864కు చేరిందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే... మహారాష్ట్రలోనే మరో ముగ్గురు స్వైన్ ఫ్లూ రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో, స్వైన్ ఫ్లూ తీవ్రంగా వ్యాపిస్తుడంటంతో ముందు జాగ్రత్త చర్యగా పుణే, పింప్రీలలో అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలను వారం రోజులపాటు మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ముంబై, నవీ ముంబైలలో కూడా పాఠశాలలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు.

మరోవైపు... స్వైన్ ఫ్లూ దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాలు తమ వైద్య యంత్రాంగాలను అప్రమత్తం చేశాయి. అత్యవసరం లేనిదే మహారాష్ట్రకు ప్రయాణించరాదని తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు సూచన చేసింది. అలాగే రైల్వేస్టేషన్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే, ప్రయాణీకులను పరీక్షించిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Show comments