సోమాలియా పైరేట్ల బందీలుగా భారతీయులు

Webdunia
ఇటీవలనే ఒక సింగపూర్ నౌకను హైజాక్ చేసి ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు తాజాగా మరో భారతీయ నౌకను హైజాక్ చేశారు. సీషెల్స్ సమీపం నుంచి పనామా వెళ్తున్న "ఎంవీ ఏవన్ ఖాలిక్" అనే నౌకపై సోమాలియా పైరేట్లు దాడిచేసి అందులోని 26 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై అంతర్జాతీయ నావికా సంఘమైన "ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో"కు చెందిన పైరసీ రిపోర్టింగ్ కేంద్రం అధినేత నోయెల్ చూంగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారతీయుల నిర్వహణలో ఉన్న ఈ నౌకలోని సిబ్బందిలో 24మంది భారతీయులు కాగా.. మిగిలిన ఇద్దరూ మయన్మార్ దేశస్థులని వివరించారు.

22 వేల టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ఓడను హైజాక్ చేసిన సమయానికి నాటో దళ నౌకకు ఎనిమిదిగంటల దూరంలో మాత్రమే ఉందని.. నాటో పైరసీ కేంద్ర వ్యతిరేక ప్రతినిధి తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ఇటలీకి చెందిన జోలీ రోసా అనే 32 వేల టన్నుల సామర్థ్యం ఉన్న మరో నౌకపై కూడా సోమాలియా పైరేట్లు కాల్పులు జరిపి హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వారి పప్పులేమీ ఉడకలేదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం - బీటెక్ విద్యార్థిని మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృత్యువాత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

Show comments