Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమాలియా పైరేట్ల బందీలుగా భారతీయులు

Webdunia
ఇటీవలనే ఒక సింగపూర్ నౌకను హైజాక్ చేసి ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు తాజాగా మరో భారతీయ నౌకను హైజాక్ చేశారు. సీషెల్స్ సమీపం నుంచి పనామా వెళ్తున్న "ఎంవీ ఏవన్ ఖాలిక్" అనే నౌకపై సోమాలియా పైరేట్లు దాడిచేసి అందులోని 26 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై అంతర్జాతీయ నావికా సంఘమైన "ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో"కు చెందిన పైరసీ రిపోర్టింగ్ కేంద్రం అధినేత నోయెల్ చూంగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారతీయుల నిర్వహణలో ఉన్న ఈ నౌకలోని సిబ్బందిలో 24మంది భారతీయులు కాగా.. మిగిలిన ఇద్దరూ మయన్మార్ దేశస్థులని వివరించారు.

22 వేల టన్నుల సరకు రవాణా సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ఓడను హైజాక్ చేసిన సమయానికి నాటో దళ నౌకకు ఎనిమిదిగంటల దూరంలో మాత్రమే ఉందని.. నాటో పైరసీ కేంద్ర వ్యతిరేక ప్రతినిధి తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ఇటలీకి చెందిన జోలీ రోసా అనే 32 వేల టన్నుల సామర్థ్యం ఉన్న మరో నౌకపై కూడా సోమాలియా పైరేట్లు కాల్పులు జరిపి హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వారి పప్పులేమీ ఉడకలేదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments