శ్వేత సౌధంలో దీపావళి వేడుకల్ని ప్రారంభించిన ఒబామా

Webdunia
FILE
శ్వేతసౌధంలో మొట్టమొదటిసారిగా దీపావళి వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా దీపావళి ప్రమిదను వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా భారతీయులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేసిన ఒబామా.. పండుగ కానుకగా, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ "హెల్త్ పాలసీ"ని ప్రకటించారు. కాగా... మేరిలాండ్ శివవిష్ణు ఆలయ అర్చకులయిన నారాయణాచారి ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీపూజలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే... అమెరికా చరిత్రలో ఆ దేశ అధ్యక్షుడు హాజరై, దీపావళి వేడుకలను జరుపుకోవటం ఇదే మొట్టమొదటిసారి. అలాగే ఈ వేడుకలను అధికారికంగా గుర్తించటం, అధ్యక్ష భవనం అయిన వైట్‌హౌస్‌లో ఆట్టహాసంగా నిర్వహించటం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచం మొత్తంమీదా మిలియన్ల సంఖ్యలో గల హిందువులు, సిక్కులు, జైనులు ఈ దీపావళి పర్వదినాన్ని అక్టోబర్ 17వ తేదీన వైభవంగా జరుపుకోనున్న సంగతి తెలిసిందే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అందుకే పుతిన్ భారత్ వెళ్తాడు, పాకిస్తాన్‌కు రాడు: పాక్ జర్నలిస్ట్, షాక్‌లో పాక్ జనం

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

Show comments