Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ్‌ను పరామర్శించిన ఎస్ఎం కృష్ణ

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో మూడు నెలల క్రితం జాత్యహంకార దాడికి గురైన తొలి భారతీయ విద్యార్థి శ్రావణ్ కుమార్‌ను భారత విదేశాంగమంత్రి ఎస్.ఎం. కృష్ణ పరామర్శించారు. ఆ దేశంలో తన ఐదురోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం రోజున కృష్ణ, శ్రావణ్‌ ఇంటికి వెళ్లి, అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా, వ్యక్తిగత సాయంగా లక్ష రూపాయలను అందజేశారు.

పావుగంటసేపు శ్రావణ్ కుటుంబంతో గడిపిన కృష్ణతో.. శ్రావణ్ తండ్రి చిదంబరరావు మాట్లాడుతూ... తమ కుమారుడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని పేర్కొన్నారు. అయితే శ్రావణ్ కోలుకునేందుకు భారత ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆసుపత్రి ఖర్చులయితే ఆసీస్, భారత్‌ ప్రభుత్వాలూ రెండు భరిస్తున్నాయని చిదంబరరావు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున కృష్ణ శ్రావణ్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. కాగా.. అంతకుమునుపు కృష్ణ, విక్టోరియా రాష్ట్ర ప్రధాని జాన్ బ్రూమ్‌బేను కలిసి, భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల గురించి చర్చించారు. అనంతరం సీనియర్ పోలీసు అధికారులతోపాటు ఆయన, నేరాలు ఎక్కువగా జరిగే రాష్ట్ర పశ్చిమ శివారు ప్రాంతాలలో పర్యటించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments