"వైట్‌హౌస్ ఫెలోస్"గా ఎన్నారైల ఎంపిక

Webdunia
ప్రతిష్టాత్మక "వైట్‌హౌస్ ఫెలోస్"గా.. భారతీయ సంతతికి చెందిన నలుగురు అమెరికన్లను ఎంపిక చేశారు. సుదీప్ బోస్, అనీశ్ మహాజన్, రాజా షా, మనీశ్ సేథీ అనే ఈ నలుగురిని... అమెరికాకు భవిష్యత్ నాయకులుగా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఓ ప్రకటనలో అభివర్ణించారు.

వైట్‌హౌస్ ఫెలోస్‌గా ఎంపికయిన ఈ ఇండియన్ అమెరికన్లు.. తమ తమ వృత్తుల్లో సేవా దృక్పథాన్ని చొప్పించగలిగారని ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రశంసించింది. కాగా... సుదీప్ బోస్ షికాగోలోని అడ్వకేట్ క్రెస్ట్ మెడికల్ సెంటర్‌లో వైద్యుడు కాగా, అనీశ్ మహాజన్ న్యూయార్క్‌లో రాబర్ట్ ఉడ్ జాన్సన్ క్లినికల్ స్కాలర్‌గా పనిచేస్తున్నారు. ఇక మనీశ్ సేథీ మసాచుసెట్స్‌లో సర్జికల్ రెసిడెంట్‌ కాగా, రాజా షా పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు.

ఇదిలా ఉంటే... వైట్‌హౌస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దేశ వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా... వీరిలో నలుగురు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Show comments