వైఎస్సార్ దుర్మరణం : శోకసంద్రంలో ఎన్నారైలు

Webdunia
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విన్న ప్రవాస భారతీయులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్నటిదాకా ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ పూజలు, ప్రార్థనలు నిర్వహించిన అమెరికా, యూకే, గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తోన్న ప్రవాసాంధ్రులు ఆయన ఇక తిరిగి రారని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.

వైఎస్సార్ ఆచూకీ గురించి ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్న ఎన్నారైలు వైఎస్సార్ మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న వైఎస్సార్.. ప్రమాదంలో మరణించటం భాదాకరమని వారు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే... చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం జరుగనున్న రచ్చబండ కార్యక్రమానికి హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైఎస్సార్ బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో నల్లమల అటవీప్రాంతంలోని రుద్రకోట కొండపై హెలీకాప్టర్ క్రాష్ అవటంతో ముఖ్యమంత్రి తన ఇతర సిబ్బంది నలుగురితోపాటు దుర్మరణం పాలయ్యారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

రెండు రోజుల్లో పెళ్లి.. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Show comments