Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీసా కుంభకోణం : భారత దంపతులకు శిక్ష

Webdunia
బ్రిటన్‌లో జరిగిన వీసా కుంభకోణంలో ప్రధాన సూత్రధారులైన ముగ్గురు భారతీయులకు జైలు శిక్షను విధించారు. పైగా, ఈ ముగ్గురు వ్యక్తులూ భార్యాభర్తలు కావటం విశేషం. ఓ పత్రికా విలేకరి ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భారీ కుంభకోణంలో జతిందర్ కుమార్ శర్మ (44), ఆయన ఇద్దరు భార్యలు రాఖి షాహి (31), నీలమ్ శర్మలు ప్రధాన నిందితులు.

న్యాయవాదిగా పేరు పొందిన జతిందర్ కుమార్ శర్మ, తన ఇద్దరు భార్యలతో కలిసి వందలాది మందికి నకిలీ ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లతో వీసాలు ఇప్పించారన్న అభియోగం రుజువుకావడంతో న్యాయమూర్తి జైలుశిక్షను విధించారు. "యూనివీసాస్" అనే కంపెనీ పేరుతో నిందితులు పై నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

కేసును విచారించిన స్థానిక న్యాయస్థానం జతిందర్ కుమార్ శర్మకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రాఖి షాహికి ఎనిమిదేళ్లు, నీలమ్ శర్మకు నాలుగు సంవత్సరాలు జైలుశిక్షను విధించింది. శిక్షాకాలం పూర్తయిన తరువాత వీరందరినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments