Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదంలో భారత సంతతి వ్యక్తుల మృతి

Webdunia
అమెరికాలోని అల్బనీలో సోమవారం జరిగిన ఓ విమాన ప్రమాదంలో ముగ్గురు భారత సంతతికి చెందిన ఇండియన్ అమెరికన్లు దుర్మరణం పాలయ్యారు. అల్బనీకి చెందిన ప్రముఖ హోటల్ వ్యాపారి జార్జి కొలాత్ తన పదకొండేళ్ల కొడుకు, డాక్టరైన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న చిన్న విమానం మొహాక్ నదిలో కూలిపోయింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన కొలాత్ కుమారుడు, డాక్టర్ల మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. కొలాత్ మృతదేహం ఇంకా దొరకలేదనీ, సాధ్యమైనంత త్వరగా వెదికి పట్టుకునేందుకు నది మొత్తం గాలిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే... మొహాక్ వ్యాలీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం విద్యుత్ సరఫరాలో లోపం కారణంగా నదిలో కూలిపోయి ఉండవచ్చునని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొలాత్ తన కొడుకును, మిత్రుడిని సంతోషపరిచేందుకు 1969లో తయారైన ఈ విమానంలో ప్రయాణించి, ప్రమాదానికి గురయ్యారు.

కాగా... కేరళకు చెందిన కొలాత్ అల్బనీలో 4 కోట్ల డాలర్ల విలువ గల ప్రాచీన కోటకు యజమాని కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే అంటున్న న్యాయ నిపుణులు!

భార్యపై అనుమానమా? క్షుద్రపూజలు చేశాడా? భార్యను బండరాళ్లతో కొట్టి హత్య

మాజీ సీజేఐను బంగళా ఖాళీ చేయించాలి.. కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

Amarnath Yatra: నాలుగు రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 70,000 మంది భక్తులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments