Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల పరామర్శకు తెదేపా బృందం

Webdunia
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులకు గురయిన భారతీయ విద్యార్థులను పరామర్శించేందుకు, అక్కడున్న తెలుగు ప్రజలందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక బృందాన్ని అక్కడికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఆస్ట్రేలియా వెళ్లేందుకు అవసరమైన వీసా, తదితర ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ఒకటి, రెండు రోజులలో ఈ బృందం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ బృందంలో తెదేపా పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు ఈ బృందంలో ఉంటారని ఆ పార్టీ వెల్లడించింది.

ఈ విషయమై తెదేపా విడుదల చేసిన ఓ ప్రకటనలో.. భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థుల రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని విమర్శించింది. అంతేగాకుండా, భారత విద్యార్థులకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది.

ఇదిలా ఉంటే... భారత విద్యార్థులపై దాడుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. దాడుల నివారణకు వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు కొత్తగా లెబనీస్ యువతకు వ్యతిరేకంగా నినాదాలు, ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments