Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో కెవిన్ రూడ్ భారత్ పర్యటన

Webdunia
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కెవిన్ రూడ్ వచ్చే నవంబర్ నెలలో భారతదేశంలో పర్యటించనున్నట్లు.. ఆ దేశ వాణిజ్య శాఖా మంత్రి సిమన్ క్రీన్ వెల్లడించారు. ఇటీవలే భారత్ పర్యటించి తిరిగి ఆసీస్ వెళ్లిన సిమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత విద్యార్థులపై దాడుల అంశం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయకూడదని ఇరుదేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు.

భారత విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నివారణకు తమ ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలను చేపట్టిందని, విదేశీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటమే తమ లక్ష్యమని ఆయన సిమన్ వివరించారు. అయితే, తమ దేశంలో శాశ్వత నివాసం కోసం కొంతమంది భారతీయ విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.

తాము విద్యను అమ్ముకుంటున్నామేగానీ, వీసాలను కాదని.. ఇకనైనా అక్రమ వీసాల విషయంలో అడ్డదారులు తొక్కవద్దని సిమన్ స్పష్టం చేశారు. కాగా.. ఆస్ట్రేలియాలో గత మే, జూన్ నెలల్లో 22 మంది భారతీయ విద్యార్థులు జాత్యహంకార దాడులకు గురయిన సంగతి తెలిసిందే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments