హత్యానేరంపై లండన్లో నివాసముంటోన్న భారత సంతతి యువకున్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రియురాలిని దారికాచి తీవ్రంగా గాయపర్చడం వల్ల ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక పత్రికల కథనం ప్రకారం లండన్లో ఉంటోన్న విక్రమ్ సింగ్ అనే యువకుడు తన మాజీ ప్రియురాలైన జెమ్మూ డోర్మన్ అనే యువతిని బట్టర్సీ ప్రాతంలో దారికాచి దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందించే సమయంలో ఆ యువతి మృతి చెందింది.
దీంతో మృతురాలి బంధువుల పిర్యాధు మేరకు పోలీసులు విక్రమ్ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తమ బిడ్డ మృతికి కారణమైన విక్రమ్ను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.