Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈ సానుకూలంగా స్పందించాలి: భారత్ ఆశాభావం

Webdunia
FILE
దుబాయ్‌లో మరణశిక్షకు గురైన 17 మంది భారతీయుల అప్పీల్‌కు యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ సానుకూలంగా స్పందించగలదని భారత్ ఆశిస్తోంది. మరణశిక్షకు వ్యతిరేకంగా భారత నిందితులు దాఖలు చేసిన అప్పీల్‌ను యూఏఈ బుధవారంనాడు పరిశీలించనుంది. దీంతో భారతీయుల అప్పీల్‌పై యూఏఈ సానుకూల స్పందన కోసం భారత్ ఎదురుచూస్తోంది.

కాగా.. ఒక పాకిస్తాన్ యువకుడి హత్యతోపాటు, మరో ముగ్గురు పాక్ యువకులను గాయపరిచినందుకుగానూ 17మంది భారతీయులకు మార్చి 29న షార్జాలోని షరియత్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే తమ తీర్పుపై భారతీయ నిందితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందనీ యూఏఈ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితుల తరపున వాదించేందుకుగానూ భారత ప్రభుత్వం మొహమ్మద్ సల్మాన్ అనే న్యాయవాదిని నియమించింది.

నిందితులు మరణశిక్షకు వ్యతిరేకంగా చేసుకున్న అప్పీల్‌ను విచారించి, తీర్పును వెలువరించేందుకు రెండువారాల సమయం పడుతుందని ఈ మేరకు యూఏఈ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమ దేశ న్యాయవ్యవస్థ, చట్టాలపై పూర్తి విశ్వాసం ఉందనీ.. అదే విధంగా విచారణ విషయంలోనూ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని న్యూఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరణశిక్ష కేసులో భారతీయ నిందితులకు యూఏఈ సానుకూలంగా స్పందించగలదని భారత్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments