Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో సామరస్య ర్యాలీ

Webdunia
బహుళ సంస్కృతులకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించేందుకు.. విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా సురక్షిత ప్రాంతమేనని సందేశం ఇచ్చేందుకుగానూ.. విక్టోరియా ప్రభుత్వం ఆదివారం మెల్‌బోర్న్‌‌లో ఓ సామరస్య ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భారతీయులతో పాటు వేలాదిమంది పాల్గొన్నారు.

మెల్‌బోర్న్, సిడ్నీ ప్రాంతాలలో భారతీయ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన వ్యక్తం కావడంతో విక్టోరియా ప్రభుత్వం ఈ ర్యాలీని నిర్వహించింది. భిన్న సంస్కృతులకు మద్ధతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే... ఈ ర్యాలీలో తాము మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో, ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశంలోని భారత విద్యార్థుల సంఘం (ఫిసా) ప్రకటించింది. అయితే, ముందుగా దూరంగా ఉండాలనుకున్న ఫిసా తన నిర్ణయం మార్చుకుని, భారతీయ విద్యార్థులు కేవలం పరిశీలకులుగా పాల్గొనాలని సూచించింది.

కాగా... భారతీయ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడులకు సంబంధించిన చర్చల్లో తమను పక్కకు పెట్టేందుకు ఆసీస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిసా ప్రతినిధి గౌతమ్‌గుప్తా ఈ సందర్భంగా ఆరోపించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments