మలేషియాలో అగ్ని ప్రమాదం: 4గురు భారతీయుల మృతి

Webdunia
FILE
మలేషియాలో బుధవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మలేషియాలోని దక్షిణ జోహోర్ రాష్ట్రంలోని ఒక చీరల దుకాణంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న నలుగురు భారతీయులు మరణించారు.

ఫైర్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన షుకోర్ సాని హసీమ్ ఈ ఘటనపై మాట్లాడుతూ... ఉదయాన్నే జరిగిన ఈ ప్రమాదంలో దుకాణంలో పేలుడుకు బద్ధలైందనీ, అందులో పనిచేస్తున్న 4 గురు భారతీయులు మరణించారని స్థానిక పత్రికలకు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు దాని పక్కనేగల మరో మూడు దుకాణాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. ప్రమాదానికి గురైన చీరల దుకాణం జోహోర్‌లోని జలాన్ పాసర్‌లో గల మాసాయ్‌వద్ద ఉందన్నారు.

కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల గురించి అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం నోరు విప్పటంలేదు. అదే విధంగా ఈ ప్రమాదానికి సంబంధించిన మరే ఇతర విషయాలు సైతం వెల్లడి కావటం లేదు. ఇదిలా ఉంటే.. మంచి నైపుణ్యం కలిగిన భారతీయులు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వేలాదిమంది అక్కడి దుకాణాలలో పనిచేస్తున్నన్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Show comments