Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత విద్యార్థులకు మైక్‌ రాన్ లేఖ

Webdunia
FILE
తమ దేశంలో విదేశీయులపై జరుగుతున్న వరుస దాడులతో భీతిల్లిన విద్యార్థులకు ధైర్యం కల్పించేందుకుగానూ ఆస్ట్రేలియా ప్రభుత్వం అసాధారణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వ అధినేత మైక్‌ రాన్, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు 4787 మంది భారత విద్యార్థులకు స్వయంగా లేఖలు రాశారు.

భద్రతపై ఆందోళన చెందవద్దని, తగినంత భద్రత కల్పిస్తామని మైక్ రాన్ భారత విద్యార్థులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతే తమకు ముఖ్యమని, విద్యార్థులకు సహాయం చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనీ, ఎవరిపైనా ఎలాంటి వివక్షా ఉండబోదని తాను హామీనిస్తున్నట్లుగా మైక్ రాన్ ఆ లేఖల్లో వివరించారు.

ఇదిలా ఉంటే... మైక్ రాన్ చేసిన పనిని భారతీయ విద్యార్థులు స్వాగతించారు. స్వయంగా ఆయనే లేఖ రాయటం తమకు ఆశ్చర్యాన్ని కల్గించిందనీ, దాడులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించటం మంచి పరిణామమని.. విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... ఉపాధి, శిక్షణ, విద్యాభ్యాసం తదితర అంశాలపై విద్యార్థులకు సలహా ఇచ్చేందుకు దక్షిణ ఆస్ట్రేలియా ఓ కార్యాలయాన్ని నెలకొల్పింది. అలాగే విదేశీ విద్యార్థులకు రాయితీపై ప్రయాణించే సౌకర్యాన్ని సైతం ఆ దేశం కల్పిస్తోంది. ఈ రకంగా జాతి వివక్ష దాడుల నేపథ్యంలో ఏర్పడిన కళంకాన్ని ఆసీస్ ప్రభుత్వం తుడుచుకునేందుకు పలు రకాల చర్యలు చేపట్టడం గమనార్హం.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments