భారత్ పర్యటన విజయవంతం : జాన్ బ్రంబీ

Webdunia
FILE
భారతదేశంలో తాను జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసిందని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రంబీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏఏపీ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. భారతీయులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

తన పర్యటనలో భాగంగా భారతదేశంలోని పలు విద్యా సంస్థలను సందర్శించాననీ... పలు వాణిజ్య సమావేశాల్లో పాల్గొన్నానని బ్రంబీ అన్నట్లు ఏఏపీ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే భారతీయులపై దాడులు పునరావృతం కావన్న సందేశాన్ని భారతీయుల్లోకి బలంగా తీసుకెళ్లగలిగానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని పై వార్తా సంస్థ తెలిపింది

ఇదిలా ఉంటే.. జాన్ బ్రంబీ ఎనిమిది రోజులుపాటు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాలో జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో ఆందోళనలు మిన్నంటిన సంగతి విదితమే. అయితే.. విద్యార్థులకు పూర్తి రక్షణ అందిస్తామనీ, ప్రపంచంలోని సురక్షిత ప్రాంతాలలో మెల్‌బోర్న్ ఒకటని బ్రంబీ తన పర్యటనలో నొక్కి చెప్పారు. ఇదంతా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా తెలుసునని ఆయన వివరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Show comments