Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆసీస్ ప్రతిష్ట మసకబారింది: పీటర్ వర్ఘీస్

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో ఇటీవలి కాలంలో భారతీయులపై చోటుచేసుకుంటున్న దాడులతో భారతదేశంలో తమ దేశ ప్రతిష్ట మసకబారిపోతోందని.. ఆ దేశ హై కమీషనర్ పీటర్ వర్ఘీస్ వాపోయారు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయనీ ఆయన పేర్కొన్నారు.

ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొన్న వర్ఘీస్ మాట్లాడుతూ.. భారతీయులపై కొనసాగుతున్న దాడులతో భారత్‌లో తమ దేశ ప్రతిష్ట దిగజారిపోతోందని ఒప్పుకోక తప్పటం లేదన్నారు. అయితే భారత్‌లో మీడియా వ్యతిరేక ప్రచారంతో తమకొచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు. తమ దేశంలోని పట్టణ ప్రాంతాలలో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడులు జాతివివక్షతో కూడుకున్నవి కావని ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా సురక్షితమైన దేశం కాదని భారత్ భావించినప్పుడే తమకు ఖచ్చితంగా నష్టం వాటిల్లుతుందని వర్ఘీస్ అన్నారు. అలా జరిగితే మాత్రం అది చాలా ఆందోళనకరమైన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. విద్యార్థులపై దాడులను అరికట్టేందుకు పోలీస్ పెట్రోలింగ్ పెంచటం, దోపిడీ నియంత్రణ బృందాల పెంపుదల, చట్టంలో పలు మార్పులు.. లాంటి చర్యలను ఆసీస్ చేపట్టిందని వర్ఘీస్ వివరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments