Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు ఆస్ట్రేలియా బృందం : వయలార్

Webdunia
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రతినిధుల బృందం జూలై నెలలో మన దేశానికి రానుందని ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వయలార్ రవి న్యూఢిల్లీలో వెల్లడించారు.

ఈ విషయమై వయలార్ రవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... 17 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంలో అక్కడి వర్సిటీల వీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్జీవోలు ఉంటారని పేర్కొన్నారు. ఈ బృందం మన దేశంలోని వివిధ నగరాలతో పాటు హైదరాబాద్‌ను కూడా సందర్శిస్తుందని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ బృందం ప్రతినిధులు సమావేశమవుతారని వయలార్ రవి తెలిపారు. ఇదిలా ఉంటే... దాడుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన తెలుగుదేశం నేత నామా నాగేశ్వరరావు ఈ సందర్భంగా వయలార్ రవికి ఓ వినతిపత్రం సమర్పించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments