బాపూజీపై పుస్తకం రాస్తా...! : గోర్డాన్ బ్రౌన్

Webdunia
FILE
ప్రపంచ నాగరికతకు జాతిపిత మహాత్మాగాంధీ అందించిన శాంతి సందేశం గురించి తాను ఓ పుస్తకం రాయాలని భావిస్తున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ వెల్లడించారు. ఇరవయ్యో శతాబ్దంలోని గొప్ప నాయకుల్లో ఒకరైన మహాత్ముడు ఎప్పుడూ అధికారం కోసం ప్రాకులాడలేదని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

గుజరాతీ, ఇంగ్లీషు భాషల్లో వెలువడే "గారవి గుజరాత్" అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్రౌన్ మాట్లాడుతూ... మన నాగరిక సమాజానికి గాంధీజీ అందించిన శాంతి సందేశంపై మరో కోణంలో పుస్తకం రాయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. గొప్ప నేతల్లో ఒకరైన బాపూజీ ప్రజల హృదయాలను, ఆలోచనలను మార్చటంద్వారా వారికి దగ్గరయ్యారని బ్రౌన్ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోని ఎంతోమందితో పాటు తనకు కూడా మహాత్మాగాంధీ స్ఫూర్తిగా నిలిచారని బ్రౌన్ తెలిపారు. మహాత్ముడు ఆచరించిన అహింస, సహాయ నిరాకరణ, విలువల గురించి తాను చాలా పుస్తకాల్లో చదివినట్లు ఆయన పేర్కొన్నారు. తాను కూడా బాపూజీ స్వయంగా ఆచరించి, ఆదర్శంగా నిలిచిన విలువల గురించి పుస్తకం రాస్తాననీ.. ఇందుకోసం తాను త్వరలోనే భారత్ పర్యటించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలియజేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

Show comments