Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వ్యాధులు నయం చేస్తానన్నానా..? : బాబా రాందేవ్

Webdunia
క్యాన్సర్, ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తానని, తానెప్పుడూ చెప్పలేదని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్పష్టం చేశారు. స్కాట్లాండ్‌లోని లిటిల్ కాంబ్రే ఐలాండ్‌లో యోగా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఆయన అంతర్జాతీయ విలేకరులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ప్రజల వ్యాధులను నయంచేసి, వారిని ఆరోగ్యవంతులుగా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా చేసేందుకు 25 నుంచి 50 సంవత్సరాలు పడుతుందనీ, అంతవరకూ తాను స్థిరంగా అందుకోసం కృషి చేస్తానని అన్నారు.

అలాగే.. తన ద్వారా నేర్చుకున్న యోగాసనాల ద్వారా తమ వ్యాధులు నయమయ్యాయని ప్రజలు చెప్పినట్లయితే.. అది తన తప్పుగా అనటం ఎంతవరకు సబబు అని మీడియాను ఈ సందర్భంగా రాందేవ్ ప్రశ్నించారు. మీ యోగాసనాలతో క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థత కల్పిస్తారా..? అని విలేకరులు అడిగిన ప్రశ్నకుగానూ ఆయన పై విధంగా స్పందించారు.

అయితే ఆక్సిజన్ పుష్కళంగా ఉన్న వాతావరణంలో క్యాన్సర్ కణాలు మనుగడ సాగించలేవని రుజువయిందనీ, ఆరోగ్యకరమైన శ్వాస గురించే యోగా తెలియజెబుతుందని రాందేవ్ వివరించారు. కాగా... లిటిల్ కాంబ్రే ఐలాండ్‌ ఏకాంత దీవిలో పతంజలి యోగ్‌పీత్ (యూకే) ట్రస్టు ఓ నూతన యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్‌లోని భారత సంతతికి చెందిన శ్యాం, సునీత పొద్దర్ అనే దంపతులు ఈ లిటిల్ కాంబ్రే ఐలాండ్‌ను కొనుగోలు చేసి పతంజలి యోగ్‌పీత్‌కు బహుమతిగా అందించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక అంశాలపై పరిశోధన సాగించేందుకుగానూ రాందేవ్ ఈ యోగ్‌పీత్ ట్రస్టును ఏర్పాటు చేయడం గమనార్హం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments