Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాసుల నమ్మకాన్ని సంపాదిస్తాం : సామి వేలు

Webdunia
ప్రవాస భారతీయుల నమ్మకాన్ని తిరిగీ సంపాదిస్తామని మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎమ్ఐసీ) అధ్యక్షుడు సామి వేలు వ్యాఖ్యానించారు. మరింతగా కష్టపడి పనితీరును మెరుగు పరచుకుంటామనీ, లేకపోతే తమ పార్టీ ఉనికినే ప్రవాసులు మర్చిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అధికార బారిసన్ నేషనల్ సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీ ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తోందన్న విషయం తెలియనివారు చాలామంది ఉన్నారని సామి వేలు ఆవేదన చెందారు. ప్రస్తుతం తమ పార్టీ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోందనీ, కష్టపడి పనిచేయకపోతే ప్రజలకు దూరమవ్వాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరించారు.

64 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎమ్ఐసీ పార్టీ ఇతరులు వేలెత్తి చూపించే విధంగా ఎన్నటికీ ప్రవర్తించబోదని ఈమేరకు సామి వేలు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో జరుగనున్న పార్టీ ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆయన తన కార్యకర్తలకు సూచనప్రాయంగా తెలియజేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments