పార్టీకి పూర్వ వైభవం తెస్తాం..! : సామివేలు

Webdunia
రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తాము మరింతగా బలం పుంజుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు మలేసియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎమ్‌ఐసీ) అధ్యక్షుడు సామివేలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. మలేసియాలోనే అతిపెద్ద భారతీయ పార్టీ అయిన ఎమ్‌ఐసీ తన బ్రాంచ్ కార్యాలయాలను దాదాపుగా రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఉండే 3,600 కార్యాలయాలను ఆరు వేలకు పెంచనున్నట్లు సామివేలు వివరించారు. ఈ కొత్త కార్యాలయ పదవుల్లో యువత, మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు ఆయన తెలిపారు. భారతీయులు అధికంగా నివసిస్తున్న ప్రాంతంలో సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని సామివేలు చెప్పారు.

ఎమ్ఐసీ పార్టీలో గ్రాడ్యుయేట్ల సేవలను సైతం మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కూడా తాము భావిస్తున్నట్లు సామివేలు పేర్కొన్నారు. తమ పార్టీలో చేరాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా... బ్లాగ్‌ల ద్వారా ఇతర సభ్యులకు, భారతీయులకు దగ్గరయ్యే ప్రయత్నాలను కూడా చేయాలని, ఫేస్‌బుక్‌ వాడకం ద్వారా ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని సామివేలు పార్టీ సభ్యులను ఈ సందర్భంగా కోరారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

Show comments