Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పద్మ అవార్డు"లపై ప్రవాస భారతీయుల హర్షం..!

Webdunia
FILE
భారత ప్రభుత్వం తమకు ప్రకటించిన "పద్మ అవార్డు"ల పట్ల అమెరికా ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. తమకు దక్కిన విశిష్ట పురస్కారాలను వినయపూర్వకంగా స్వీకరిస్తామని ప్రవాస ప్రముఖులు షరీద్ జకారియా, శాంత్ సింగ్ ఛత్వాల్, సుధీర్ ఎమ్ ఫరీఖ్ తదితరులు పేర్కొన్నారు.

ప్రవాస పాత్రికేయుడు షరీద్ జకారియా ఈ మేరకు మాట్లాడుతూ.. పద్మ అవార్డుకు ఎంపిక కావటం తనకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. గొప్ప పనులు చేసినవారితో సమానంగా తనను గౌరవించటం అన్నింటికంటే సంతోషం కలిగిస్తోందని చెప్పారు. కాగా.. న్యూస్‌వీక్ అంతర్జాతీయ సంపాదకుడిగా పనిచేస్తున్న జకారియాను "పద్మభూషణ్" అవార్డు వరించింది.

ఎన్నారై వ్యాపారవేత్త శాంత్ సింగ్ ఛత్వాల్ మాట్లాడుతూ.. తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి రుణపడి ఉంటానని సంతోషం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగానూ తనకు ఈ గౌరవం దక్కిందని ఆయన వివరించారు. కాస్త ఆలస్యమైనా తనపై నమ్మకం ఉంచి ఈ గౌరవానికి ఎంపిక చేయటంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నారై వైద్యుడు, సేవకుడు, పబ్లిషర్ సుధీర్ ఎమ్ పరీఖ్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డుతో తన బాధ్యత మరింతగా పెరిగిందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించటంపట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన, భారత్-అమెరికా సంబంధాల పటిష్టతకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నాడు.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments