Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ కారు ప్రమాదం : భారతీయుల దుర్మరణం

Webdunia
నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఒక 15 సంవత్సరాల బాలుడికి వైద్య పరీక్షలు చేయించేందుకు ఖాట్మండు నగరానికి వచ్చారు.

మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటల మధ్యన ఆసుపత్రి నుంచి ఏడుగురు భారతీయులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు.. స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. పేవ్‌మెంట్‌మీద నడుస్తున్న వీరిని అతివేగంగా వస్తోన్న కారు ఒకటి అదుపుతప్పి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారన్నారు.

చికిత్సకోసం వచ్చిన పదిహేనేళ్ల బాలుడితో సహా ఈ భారతీయులలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారని పోలీసు అధికారి తెలిపారు. ఇక మిగిలిన బీహార్‌లోని ప్రాంతానికి చెందిన దీపక్ గుప్తా అనే వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ.. స్థానిక బిర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన చెప్పారు.

మరణించిన వారిలో బీహార్‌లోని సీతామర్హి ప్రాంతానికి చెందిన ధర్మనాథ్ సిన్హా (50), క్రిష్ణ దేవి (40), మదన్ గుప్తా (29), సంజీవ్ గుప్తా (15)లు మరియు మోతిహరి ప్రాంతానికి చెందిన బినా సింగ్ (46), మరో 18 సంవత్సరాల వ్యక్తి ఉన్నట్లు పోలీసు అధికారి వివరాలు అందించారు. అయితే ఈప్రమాదానికి కారకులైన కారు డ్రైవర్, కారులోని వ్యక్తులు పారిపోయినట్లు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

Show comments