నేటి నుంచి న్యూఢిల్లీలో "ప్రవాసీ భారతీయ దివస్"

Webdunia
FILE
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే "ప్రవాసీ భారతీయ దివస్" గురువారం నుంచి దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు పలువురు హాజరుకానున్నారు.

పెట్టుబడులు పెట్టేలా ప్రవాస భారతీయులను ప్రోత్సహించటంపైనే ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సదస్సుకు దాదాపు పదిహేను వందలమంది దాకా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది.

పదిహేనుమంది ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సైతం ఈ సదస్సులో పాల్గోనున్నారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రవాస భారత వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించే సౌకర్యాన్ని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం అందుబాటులోకి తేవటం విశేషం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

Show comments