Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వంద్వ పౌరసత్వంపై హెచ్ఎస్‌ఎమ్‌పీ బహిరంగ లేఖ

Webdunia
FILE
ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలంటూ.. "హెచ్‌ఎస్‌ఎమ్‌పీ" భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఓ బహిరంగ లేఖను రాసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించటం ద్వారా మాతృదేశంతో సంబంధాలు కొనసాగించేలా చూడాలని బ్రిటన్‌లోని పలు వలస జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత ప్రతిభ కలిగిన వలస వృత్తి నిపుణుల సంఘం (హెచ్‌ఎస్‌ఎమ్‌పీ) ఈ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేసింది.

ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని వీలైనంత త్వరగా అమలు చేయాలని పై లేఖలో హెచ్‌ఎస్‌ఎమ్‌పీ అధ్యక్షుడు అమిత్ కపాడియా కోరారు. కాగా.. 2010 జనవరిలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు ఎన్నారైలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధానికి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ బహిరంగ లేఖ రాసిన ప్రవాస భారతీయులు.. కొత్త తరానికి తమ దేశం గురించి తెలుసుకునేందుకు ద్వంద్వ పౌరసత్వం దోహదపడుతుందన్నారు. అలాగే భారతదేశ ఆదర్శాలను ప్రపంచమంతా చాటి చెప్పేందుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. పలు ప్రజాస్వామ్య దేశాలు తమ పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని ఇస్తున్న విధంగా భారతీయులకు కూడా ఇవ్వాలని వారు ఆ లేఖలో కోరారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments