దాడుల వివరాలు భారత్‌కు అందిస్తాం : విక్టోరియా

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల వివరాలను భారతదేశానికి అందజేస్తామని విక్టోరియా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన విక్టోరియా ప్రధానమంత్రి జాన్ బ్రంబీ ఈ మేరకు న్యూఢిల్లీలో ఈ ప్రతిపాదన చేశారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

విక్టోరియా ప్రాంతంలో ఇప్పటిదాకా భారతీయులపై జరిగిన దాడులు, వాటికి సంబంధించి నమోదైన కేసులు, దర్యాప్తులో పురోగతి తదితర అంశాలను పూర్తి వివరాలతో సహా అందిస్తామని భారత ప్రభుత్వానికి బ్రంబీ హామీ ఇచ్చారని .. విక్టోరియా ప్రతినిధి స్థానిక వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వీటి ద్వారా దాడులకు సంబంధించిన కేసుల పురోగతి తదితర అంశాలను ఈ వివరాల ద్వారా తెలుసుకునే అవకాసం ఉంటుందని ఆ ప్రతినిధి వివరించారు.

ఇదిలా ఉంటే.. దాడుల నేపథ్యంలో ఆసీస్-భారత్‌ల నడుమ దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకునే క్రమంలో ఇటీవల భారత్‌లో పర్యటించిన బ్రంబీ.. తిరిగీ విక్టోరియాకు చేరుకున్న తరువాత ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా.. గత నెలలో బ్రంబీ వారంరోజులపాటు భారతదేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దాడుల నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే బ్రంబీ తిరిగి వెళ్లిన కొన్నిరోజుల్లోనే భారతీయులపై దాడులు మళ్లీ యధాతథంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

Show comments