దాడులు గర్హనీయం : కెవిన్ రూడ్

Webdunia
భారతీయులపై తమ దేశంలో జరిగిన దాడులు గర్హనీయమని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రూడ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడిన ఆయన... దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

వరుసగా భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో తాను మాట్లాడానని రూడ్ వెల్లడించారు. దాడులను ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ తనను ఫోన్లో కోరారని... దాడుల విషయంపై ప్రభుత్వం కూడా చర్చిస్తోందని, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని రూడ్ తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఉంటున్న 90 వేలమంది భారతీయ విద్యార్థులను అతిథులుగా గౌరవించి, వారిని కాపాడల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని రూడ్ పునరుద్ఘాటించారు. కాగా... భారత విద్యార్థులపై వరుసగా జరుగుతున్న దాడులతో దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని ప్రతిపక్ష నేత టర్నబుల్ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడంతో కెవిని రూడ్ పై విధంగా స్పందించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

Show comments