దాడులపై ఆస్ట్రేలియా హైకమీషన్‌కు సీఎం లేఖ

Webdunia
ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై జరుగుతున్న దాడుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా... ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు భారత్‌లోని న్యూఢిల్లీలో గల ఆ దేశ రాయబారి జాన్ మెక్‌కార్తి ఓ లేఖను రాసిన వైఎస్సార్... రాష్ట్రానికి చెందిన చాలామందిపై దాడులు జరిగాయని అందులో వివరించారు.

ఆస్ట్రేలియాలో ఆంధ్ర విద్యార్థులపై జరుగుతున్న దాడులకు సంబంధించి తమ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, దీనిని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వైఎస్సార్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఆస్ట్రేలియా చాలా శాంతికాముక దేశమని విన్నామనీ... కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... అమెరికాలోని దక్షిణ మిసిసీపీ దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఎమ్.ఎస్. విద్యార్థి కడియాల మురళీకృష్ణ తల్లి నాగ సామ్రాజ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, కొడుకును పరామర్శించేందుకు అమెరికా వెళ్లేందుకుగానూ, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఆమెకు 75 వేల రూపాయల సాయాన్ని విడుదల చేస్తూ, ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

Show comments