Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడులపై ఆస్ట్రేలియా హైకమీషన్‌కు సీఎం లేఖ

Webdunia
ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై జరుగుతున్న దాడుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా... ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు భారత్‌లోని న్యూఢిల్లీలో గల ఆ దేశ రాయబారి జాన్ మెక్‌కార్తి ఓ లేఖను రాసిన వైఎస్సార్... రాష్ట్రానికి చెందిన చాలామందిపై దాడులు జరిగాయని అందులో వివరించారు.

ఆస్ట్రేలియాలో ఆంధ్ర విద్యార్థులపై జరుగుతున్న దాడులకు సంబంధించి తమ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, దీనిని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వైఎస్సార్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఆస్ట్రేలియా చాలా శాంతికాముక దేశమని విన్నామనీ... కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే... అమెరికాలోని దక్షిణ మిసిసీపీ దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఎమ్.ఎస్. విద్యార్థి కడియాల మురళీకృష్ణ తల్లి నాగ సామ్రాజ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, కొడుకును పరామర్శించేందుకు అమెరికా వెళ్లేందుకుగానూ, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఆమెకు 75 వేల రూపాయల సాయాన్ని విడుదల చేస్తూ, ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments