Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో తూ.గో.వాసి మృతి

Webdunia
జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాకర్ హుస్సేన్ (48) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాజూరు మండలం చేదువాడ గ్రామానికి చెందిన ఇతను ఆరు నెలల క్రితం మామిడి కుదురు మండలం, నగరం గ్రామానికి వలస వచ్చాడు.

నగరం గ్రామంలోనే జీవనం సాగిస్తున్న బాకర్ హుస్సేన్.. కొద్దికాలం క్రితం ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అక్కడ అగ్గిపెట్టెల పరిశ్రమలో పనికి కుదిరిన ఈయన.. కొన్నాళ్లపాటు ఇక్కడి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు ఫోన్ చేసి తన క్షేమసమాచారాలను చెబుతుండేవాడు.

అయితే గత కొన్ని రోజులుగా బాకర్ హుస్సేన్ నుంచి ఎలాంటి సమాచారమూ అందక పోవటంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనలో పడ్డారు. ఈలోగానే హుస్సేన మరణవార్త కుటుంబీకులకు తెలిసింది. అంతే వారంతా శోకసముద్రంలో మునికిపోయారు. కాగా... హుస్సేన్ దక్షిణాఫ్రికాలోని ఏ ప్రాంతంలో, ఎలా చనిపోయాడన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments