జస్‌ప్రీత్‌పై జరిగిన దాడి అబద్ధం: ఆస్ట్రేలియా

Webdunia
FILE
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై పెట్రోలుపోసి దాడికి పాల్పడినట్లు ప్రవాస భారతీయ యువకుడు జస్‌ప్రీత్ సింగ్ (29) అబద్ధం చెప్పినట్లు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. ఇది ఏ మాత్రం జాత్యహంకార దాడి కాదనీ, ఇన్య్సూరెన్స్ డబ్బుల కోసం జస్‌ప్రీత్ తన కారుకు తానే నిప్పంటించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

విచారణలో ఈ విషయాలన్నింటినీ ఒప్పుకున్న జస్‌ప్రీత్‌పై కుట్రపూరితంగా ఇన్స్యూరెన్స్ డబ్బులు రాబట్టుకున్నాడంటూ అభియోగాలు మోపామనీ, వచ్చే నెలలో విచారణ నిమిత్తం అతడిని మెల్‌బోర్న్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. ఈ మేరకు ఆసీస్ పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియాలో తాజాగా పలు కథనాలు వెలువడ్డాయి.

ఇదిలా ఉంటే.. జనవరి 8వ తేదీన తనపై కొంతమంది దుండగులు పెట్రోలు పోసి, వాహనానికి నిప్పంటించి పారిపోయినట్లు జస్‌ప్రీత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వారం రోజులముందే నితిన్ గార్గ్ అనే విద్యార్థి ఆసీస్‌లో దారుణ హత్యకు గురయిన నేపథ్యంలో సింగ్ ఆరోపణలు మీడియాలో ప్రముఖంగా రావటంతో, భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఈ అంశంపై ఆసీస్ పోలీసులు విచారణను వేగం చేయగా.. సింగ్ భాగోతం బయటపడింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Show comments