చిదంబరంజీ.. వీసా రూల్స్‌ను పరిశీలించరూ: ప్రవాసులు

Webdunia
FILE
పాకిస్థాన్‌లో జన్మించిన విదేశీ జాతీయులకు ప్రవేశపెట్టిన కొత్త వీసా నిబంధనలవల్ల భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని.. న్యూయార్క్‌లోని ఇండియన్ అమెరికన్ సంస్థ ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను పునఃపరిశీలించాలంటూ ఆ సంస్థ భారత హోంశాఖా మంత్రి పి. చిదంబరంకు విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ఇండియన్ అమెరికన్ మేధావుల ఫోరం ప్రతినిధి బృందం ఒకటి న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌కు చెందిన డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఏఎం గోన్డానేకు ఓ వినతి పత్రం సమర్పించింది. పాక్‌లో పుట్టిన అమెరికా జాతీయుల వీసా దరఖాస్తులను పరిశీలన కోసం భారత్ పంపాలంటూ అన్ని భారత కాన్సులేట్లకు హోంశాఖ ఆదేశాలు జారీ చేయటాన్ని ఈ బృందం స్వాగతించింది.

అయితే పాకిస్థాన్‌లో పుట్టిన వేలాదిమంది ఇండియన్ అమెరికన్లు వ్యాపారం పనిమీదగానీ, పర్యటనల కోసంగానీ భారత్ వస్తుంటారని ఫోరం అభిప్రాయపడింది. కాగా.. తాజా వీసా నిబంధనలవల్ల వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి, ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఫోరం సమర్పించిన వినతి పత్రంలో పేర్కొంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Show comments