చికాగోలో స్వాతంత్ర్యోత్సవ సంబరాలు

Webdunia
FILE
భారత 62వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చికాగోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను చికాగోలోని ప్రవాస భారతీయులందరూ వారం రోజులపాటు జరుపుకుంటారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో చికాగో మేయర్ సందేశాన్ని ప్రజా సంబంధాల కమీషన్ డైరెక్టర్ క్రిపాల్ జాలా చదివి వినిపించారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సంబరాలలో... భారతీయుల సాంగత్యంతో తాము వ్యాపార, వైద్య రంగాలలోనే కాకుండా అనేక రంగాలలో అభివృద్ధి సాధించామంటూ చికాగో నగర మేయర్ రిచర్డ్ డాలే పంపించిన సందేశాన్ని అందరిముందూ చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు హైదర్ మహ్మద్ మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండో అమెరికన్ యువత.. పంజాబీ, బాలీవుడ్ సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌లు వేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Show comments