చండీఘడ్ ఎన్నారైలకు ప్రత్యేక సెల్

Webdunia
ప్రవాస భారతీయులకు న్యాయ సహాయం అందజేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. చండీఘడ్‌కు చెందిన ఎన్నారైలకు న్యాయ సంబంధ విషయాలలో సహాయం చేసేందుకుగానూ ఈ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ విషయమై చండీఘడ్‌ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఆస్తి, ఆర్థిక, వివాహం తదిర వివాదాలలో న్యాయం పొందేందుకు ఎన్నారైలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందనీ.. కొన్నిసార్లు ఏజెంట్లబారిన పడి వారు మోసపోతున్నారని చెప్పారు. కాబట్టి.. ఇలా మోసానికి గురవుతున్న ఎన్నారైలకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ తగిన సూచనలు, సలహాలను ఇవ్వటమే గాకుండా, న్యాయ సంబంధ విషయాలలో జాప్యం జరుగకుండా చూస్తుందని ఆయన వివరించారు.

ఇదిలాఉంటే... రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో నడిచే ఈ ఎన్నారై సెల్‌లో సీనియర్ పోలీస్ ఎస్పీ, దౌత్యవేత్త, ప్రవాస ప్రతినిధి ఉంటారు. హెల్ప్‌లైన్, ఈ-మెయిల్, పోస్ట్ ద్వారా ప్రత్యేక సెల్‌కు ఫిర్యాదులను పంపవచ్చు. విదేశాల్లోని భారత కార్యాలయాల్లో కూడా ఈ ఫిర్యాదులను ఉంచుతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Show comments