గల్ఫ్‌లో ఆంధ్రుడి ఆత్మహత్య

Webdunia
ఎన్నో ఆశలతో ఉద్యోగం కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ ఆంధ్రుడు అర్ధాంతరంగా మరణించాడు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ బాషా అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు ఉద్యోగం కోసం గత జూలై నెలలో గల్ఫ్‌లోని రియాద్‌కు చేరుకున్నాడు.

తన మామ ఎస్.కే. ముజఫర్‌తో కలిసి రియాద్‌లో నివసిస్తున్న బాషా... అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. అయితే గత బుధవారం రోజున అతడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అతడి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరావటం లేదు.

ఇదిలా ఉంటే.. బాషా మామ ముజఫర్ మీడియాతో మాట్లాడుతూ.. బాషాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, అతడికి తానే సౌదీ వీసా ఇప్పించాననని, అతని తమ్ముడు కూడా రియాద్‌లోనే పనిచేస్తున్నాడని తెలిపారు. కాగా... తమ కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ బాషా తల్లిదండ్రులు భారత రాయబార కార్యాలయానికి విన్నవించుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

Show comments