Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ చైనా పర్యటన: భారతీయ కుటుంబాలకు ఓదార్పు..!!

Webdunia
PTI
ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ.. అక్కడ పోలీసుల అదుపులో ఉన్న 21 మంది భారతీయ కుటుంబాలను కలిశారు. వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా ఆరోపించబడి, పోలీసుల ఇంటరాగేషన్‌ను ఎదుర్కొంటున్న 21 మంది నిందితుల కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఊరడించారు. ఈ విషయాన్ని చైనా అధికారులతో చర్చించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఈ మేరకు కృష్ణ హామీ ఇచ్చారు.

కాగా.. దక్షిణ చైనా సిటీ అయిన షెన్‌జెన్‌లో నివసిస్తున్న 20 మంది ప్రవాస భారతీయులను వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బును చెలామణి చేస్తున్నాడంటూ మరో భారతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్.ఎం. కృష్ణ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు.

ఇదిలా ఉంటే.. బాధితులు వెంటనే తమ తమ కుటుంబ సభ్యులను కలవాలని కోరుకుంటున్నారని, వారికి ఆ అవకాశం కల్పించేలా చైనా అధికారులను కలిసి ఏర్పాట్లు చేయాలని చైనాలోని భారత కాన్సులేట్‌ను భారత ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా ప్రీమియర్ వెన్ జియాబావో మరియు విదేశాంగ మంత్రి యాంగ్ జైచీలతో జరిగే చర్చలలో ఈ విషయాన్ని ప్రస్తావించి, న్యాయం జరిగేలా చూస్తానని కృష్ణ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా.. కృష్ణ బుధవారం పొద్దుపోయిన తరువాత వెన్, యాంగ్‌లతో సమావేశం కానున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments