Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ హత్యపై దర్యాప్తుకై భారత్ డిమాండ్

Webdunia
దక్షిణాఫ్రికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్ హత్యపై దర్యాప్తు జరిపించాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కిరణ్ హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జోహెన్నెస్‌బర్గ్ నగర పోలీసు కమీషనర్‌ను కోరినట్లు దక్షిణాఫ్రికాలోని భారత ఉప రాయబారి అరవింద నాన్వెల్ వెల్లడించారు.

ఈ విషయమై అరవింద మాట్లాడుతూ... కిరణ్ హత్యోదంతాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం దృష్టికి తేవాలని తాము కోరినట్లు తెలిపారు. కిరణ్‌పై జరిగిన దాడి వెనుక జాతి వివక్ష ఉందని అనుకోవడం లేదని, కేవలం దోపిడీ చేసేందుకే దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు.

ఈ దేశంలో గతంలో కూడా భారతీయులపై చిన్నపాటి దాడులు జరిగాయని, అయితే అలాంటి దాడుల్లో చనిపోవడం మాత్రం ఇదే మొదటిసారని అరవింద పేర్కొన్నారు. కిరణ్ మృతదేహం స్వదేశానికి తరలించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే... వరంగల్ జిల్లా ఆరెపల్లికి చెందిన కిరణ్‌పై దుండగులు కాల్పులు జరిపి... ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments