ఒబామా న్యాయం చేయండి : సిక్కు సంస్థల లేఖ

Webdunia
FILE
సిక్కుల ఊచకోతలో బలైపోయిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలని.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని కోరుతూ, ఆ మతానికి చెందిన రెండు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. భారత ప్రధాని మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా సిక్కుల ఊచకోత అంశాన్ని లేవనెత్తి, తద్వారా బాధితులకు న్యాయం చేకూరేలా, ఒత్తిడి తీసుకురావాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.

అమెరికాలోని సిక్కుల న్యాయ పరిరక్షణ మానవ హక్కుల సంస్థ, పంజాబ్‌లోని ఆల్ ఇండియా సిక్కు విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎస్ఎఫ్) అనే రెండు సంస్థలు బరాక్ ఒబామాకు పై లేఖను రాశాయి. 1984వ సంవత్సరంలో సిక్కులను లక్ష్యంగా చేసుకుని జరిగిన నరమేథంలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆ లేఖలో పై సంస్థలు వివరించాయి.

కాగా... వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ఒబామా ఇచ్చే తొలి ఆతిథ్య విందులో పాల్గొనేందుకుగానూ భారత ప్రధాని మన్మోహన్ అమెరికాకు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... 1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని స్వయానా ఆమె అంగరక్షకులైన సిక్కులు కాల్చి చంపటంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి విదితమే. నాలుగు రోజులపాటు సాగిన ఊచకోతలో ఢిల్లీతో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో వేలాదిమంది సిక్కుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమీన్‌పూర్ హత్య కేసు: ఇద్దరూ కలవకుంటే నా కూతురికి కడుపు ఎలా వచ్చింది?

మంత్రి కొండా సురేఖ అరెస్టు తప్పదా?

రూ. 9500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్

ఎస్ఐఆర్ పేరుతో ఓటు తొలగిస్తే కిచెన్ టూల్స్‌తో సిద్ధం కండి.. మహిళలకు మమతా పిలుపు

నా వెన్నెముక వైఎస్ జగన్.. ఆయనే బెయిలిప్పించారు : బోరుగడ్డ అనిల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

Show comments