Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒబామా న్యాయం చేయండి : సిక్కు సంస్థల లేఖ

Webdunia
FILE
సిక్కుల ఊచకోతలో బలైపోయిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలని.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని కోరుతూ, ఆ మతానికి చెందిన రెండు సంస్థలు బహిరంగ లేఖ రాశాయి. భారత ప్రధాని మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా సిక్కుల ఊచకోత అంశాన్ని లేవనెత్తి, తద్వారా బాధితులకు న్యాయం చేకూరేలా, ఒత్తిడి తీసుకురావాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.

అమెరికాలోని సిక్కుల న్యాయ పరిరక్షణ మానవ హక్కుల సంస్థ, పంజాబ్‌లోని ఆల్ ఇండియా సిక్కు విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎస్ఎఫ్) అనే రెండు సంస్థలు బరాక్ ఒబామాకు పై లేఖను రాశాయి. 1984వ సంవత్సరంలో సిక్కులను లక్ష్యంగా చేసుకుని జరిగిన నరమేథంలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆ లేఖలో పై సంస్థలు వివరించాయి.

కాగా... వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ఒబామా ఇచ్చే తొలి ఆతిథ్య విందులో పాల్గొనేందుకుగానూ భారత ప్రధాని మన్మోహన్ అమెరికాకు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... 1984, అక్టోబర్ 31న అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని స్వయానా ఆమె అంగరక్షకులైన సిక్కులు కాల్చి చంపటంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి విదితమే. నాలుగు రోజులపాటు సాగిన ఊచకోతలో ఢిల్లీతో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో వేలాదిమంది సిక్కుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం : 13 మంది మిస్సింగ్

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

హంతకులు కూడా ఇలా కొట్టరు... తమిళనాడు ఖాకీలపై హైకోర్టు సీరియస్

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments