Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని దారుణాలు: ఆసీస్‌లో మరో భారతీయుడిపై దాడి

Webdunia
FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మెల్‌బోర్న్‌లో 29 సంవత్సరాల భారతీయ యువకుడిపై నలుగురు దుండగులు దాడిచేసి అతడికి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

జస్‌ప్రీత్ సింగ్ అనే భారతీయ యువకుడు మెల్‌బోర్న్‌లోని ఎసెండన్‌లో దాడికి గురైనట్లు ఏబీసీ కథనం వెల్లడించింది. భార్యతో కలిసి ఓ డిన్నర్ పార్టీకి వెళ్లిన సింగ్, ఇంటికి చేరుకున్నాక కారు పార్కింగ్ చేస్తుండగా దుండగులు దాడికి తెగబడి, ఒంటిపై ఇంధనం చల్లి నిప్పంటించి పరారైనట్లు ఏబీసీ వెల్లడించింది.

ఈ ఘటనలో 15 శాతం గాయాలకు గురైన సింగ్ ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ, అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఏబీసీ వివరించింది. ఇదిలా ఉంటే.. జస్‌ప్రీత్ ఆస్ట్రేలియన్ పౌరుడు కావటంవల్ల, ఇది జాత్యహంకార దాడి అయ్యే అవకాశం లేదని ఆసీస్ అధికారులు చెబుతున్నారు.

కాగా.. ఈనెల రెండో తేదీన భారతీయ విద్యార్థి నితిన్ గార్గ్ హత్య సంఘటనను మరువకముందే ఈ దాడి జరగటంతో అక్కడి భారతీయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నితిన్ హత్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Show comments