Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ప్రవాసుల్లోనూ "సమైక్యాంధ్ర నినాదం"

Webdunia
FILE
సమైక్యాంధ్ర ఉద్యమ నినాదం అమెరికాలోని ప్రవాస భారతీయుల్లోకి చొచ్చుకెళ్లింది. సమైక్యాంధ్రకు మద్ధతుగా కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలలోని తెలుగువారు పలు కార్యక్రమాలను నిర్వహించి, "సమైక్యాంధ్రే ప్రగతికి సంకేతం" అంటూ ఎలుగెత్తి నినదించారు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల కారణంగా రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి తలెత్తటం దురదృష్టకరమని ఎన్నారైలు ఈ సందర్భంగా విమర్శించారు.

సమైక్యాంధ్రను సమర్థిస్తూ డల్లాస్‌లోని కోకిల రెస్టారెంట్‌లో ఏర్పాటైన సమావేశానికి దాదాపు 200 మంది తెలుగువారు హాజరయ్యారు. సమైక్యాంధ్రకు మద్ధతుగా భారతదేశంలోని రాజకీయ పార్టీలకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ ప్రత్యేక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించాలని వీరంతా నిర్ణయించారు.

అలాగే కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలోని సెర్రా థియేటర్స్ ప్రాంగణంలో నిర్వహించిన మరో సమావేశంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్ధతుగా ఓ తీర్మానాన్ని ఆమోదించారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, విడిపోవటంవల్ల లాభంకంటే నష్టమే ఎక్కువని వారు స్పష్టం చేశారు. కాగా ఈ సమావేశంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 500 మంది ఎన్నారైలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర సమైక్యాంధ్ర సమితి కన్వీనర్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలుగా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. అవసరమయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారినందరినీ సమన్వయపరచి, హైదరాబాద్‌లోనే భారీ సభను నిర్వహిస్తామని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments