Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల పరామర్శకు తెదేపా బృందం

Webdunia
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులకు గురయిన భారతీయ విద్యార్థులను పరామర్శించేందుకు, అక్కడున్న తెలుగు ప్రజలందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక బృందాన్ని అక్కడికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఆస్ట్రేలియా వెళ్లేందుకు అవసరమైన వీసా, తదితర ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ఒకటి, రెండు రోజులలో ఈ బృందం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ బృందంలో తెదేపా పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు ఈ బృందంలో ఉంటారని ఆ పార్టీ వెల్లడించింది.

ఈ విషయమై తెదేపా విడుదల చేసిన ఓ ప్రకటనలో.. భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థుల రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని విమర్శించింది. అంతేగాకుండా, భారత విద్యార్థులకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది.

ఇదిలా ఉంటే... భారత విద్యార్థులపై దాడుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. దాడుల నివారణకు వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు కొత్తగా లెబనీస్ యువతకు వ్యతిరేకంగా నినాదాలు, ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments