Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంద్యం దెబ్బకు ప్రవాసాంధ్రుడి బలి

Webdunia
FILE
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థికమాంద్యం దెబ్బకు మరో ప్రవాసాంధ్రుడు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి చెందిన చంద్రనారాయణ మూర్తి బొమ్మిడి (49) ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికమాంద్యం కారణంగా మనోవ్యధకు గురైన ఈయన గత కొద్దిరోజులుగా కోమాలో ఉంటూ, ఈనెల 9న ఆసుపత్రిలో మరణించారు.

ఆర్థికమాంద్యం నేపథ్యంలో సంవత్సరకాలంగా సరైన ఉద్యోగం లేకపోవడం, కుటుంబాన్ని ఎలా పోషించాలన్న వ్యథతో మూర్తి అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అంతకుముందు మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యోగాలు వస్తూ, పోతూ ఉండటం, కుటుంబానికి తానొక్కడే ఆధారం కావటంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కోమాలోకి వెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా... ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదిలా ఉంటే... నారాయణ మూర్తి మృతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేని ఆ కుటుంబాన్ని సాధ్యమైనంత మేరకు ఆదుకుంటామని నాట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంతేగాకుండా మూర్తి మృతదేహాన్ని స్వదేశం పంపించటంతోపాటు, అక్కడ ఆయన కుటుంబ సభ్యులు బ్రతికేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని నాట్స్ వెల్లడించింది. అలాగే.. మూర్తి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు దాతలు ఎవరైనా ముందుకు రావాలని నాట్స్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments