Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మోహన్ జీ.. 2జీపై చర్యలు తీసుకోండి ప్లీజ్: ఎన్ఆర్ఐలు

అవినీతి నుంచి భారత్‌ను కాపాడుకుందాం: ఎన్ఆర్ఐలకు పిఎఫ్ఎల్ పిలుపు

Webdunia
File
FILE
అమెరికాతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల సంస్థ "పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా" అవినీతికి వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచారాన్ని చేపట్టింది. పార్టీలు, సిద్ధాంతాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా భారతీయ పౌరులందరూ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

దేశంలో రోజుకు ఒకటిగా వెలుగుచూస్తున్న కుంభకోణాల నేపథ్యంలో ప్రజలలో చైతన్యం తీసుకురావడం, ఈ కుంభకోణాలపై సత్వరమే స్పందించాల్సిందిగా దేశాధినేతను కోరడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ కుంభకోణాలపై దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు శాంతియుతంగా తమ ఆందోళనను దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లాలని పిఎఫ్ఎల్ పిలుపునిచ్చింది.

ఈ మెయిల్స్, పోస్ట్ కార్డ్స్, మనీ ఆర్డర్స్, ప్రధానికి అడ్రస్ చేయబడిన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు వంటి వాటి ద్వారా ఈ విషయాన్ని ప్రధాని దృష్టి తీసుకెళ్లాలని పిఎఫ్ఎల్ నిర్ణయించింది. ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యులు, లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఒక్క రూపాయి మనీ ఆర్డర్‌ను డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పంపి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అన్ని స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దు చేసి పునఃకేటాయించడం, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న అవినీతి పరులను కఠినంగా శిక్షించడం, భవిష్యత్తు కుంభకోణాల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి చట్టాలను కఠినతరం చేయడం, విండ్ ఫాల్ టాక్స్, హాంగ్‌కాంగ్ తరహా వ్యక్తిగత అవినీతి వ్యతిరేక సంస్థను స్థాపించడం వంటివి ఈ ప్రచారం ముఖ్య లక్ష్యాలు.

లక్ష సంతకాల సేకరణపై పనిచేస్తున్న హోస్టన్‌కు పిఎఫ్ఎల్ సభ్యురాలు హైమా సాగీ మాట్లాడుతూ.. "కొంత కాలం తర్వాత భవిష్యత్తులో భారత చరిత్ర పుస్తకాల్లో అవినీతి గురించి లిఖించబడుతుంది. ఆశ్చర్యం ఏంటంటే వాటిలో 2జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణంగా నిలుస్తుంది. కుంభకోణాల నుంచి భారత్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంద"ని వ్యాఖ్యానించారు.

రానున్న వారాంతంలోపు వివిధ నగరాల నుంచి ప్రధానికి వేలాది సంఖ్యలో ఈమెయిల్స్, పోస్టు కార్డులను పంపడంలో సహకరించడానికి అట్లాంటాలో నివసిస్తున్న రామ్‌గోపాల్ మాదారపు ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్టు కార్డులు మనీ ఆర్డర్లు పంపాలని పిఎఫ్ఎల్ పిలుపునిచ్చింది. ఈమెయిల్ ద్వారా తెలిజజేయాలనుకుంటే.. మన్మోహన్‌@సన్‌సద్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్, అలాగే ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేయాలంటే.. డబ్య్లుడబ్య్లుడబ్య్లు డాట్ ఐపిటిషన్ డాట్‌ కామ్‌ల ద్వారా తమ నిరసన తెలుపవచ్చని పిఎఫ్ఎల్ సూచించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం