Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాసుల నమ్మకాన్ని సంపాదిస్తాం : సామి వేలు

Webdunia
ప్రవాస భారతీయుల నమ్మకాన్ని తిరిగీ సంపాదిస్తామని మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎమ్ఐసీ) అధ్యక్షుడు సామి వేలు వ్యాఖ్యానించారు. మరింతగా కష్టపడి పనితీరును మెరుగు పరచుకుంటామనీ, లేకపోతే తమ పార్టీ ఉనికినే ప్రవాసులు మర్చిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అధికార బారిసన్ నేషనల్ సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీ ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తోందన్న విషయం తెలియనివారు చాలామంది ఉన్నారని సామి వేలు ఆవేదన చెందారు. ప్రస్తుతం తమ పార్టీ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోందనీ, కష్టపడి పనిచేయకపోతే ప్రజలకు దూరమవ్వాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను హెచ్చరించారు.

64 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎమ్ఐసీ పార్టీ ఇతరులు వేలెత్తి చూపించే విధంగా ఎన్నటికీ ప్రవర్తించబోదని ఈమేరకు సామి వేలు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో జరుగనున్న పార్టీ ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆయన తన కార్యకర్తలకు సూచనప్రాయంగా తెలియజేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments