Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో అరెస్టయిన భారతీయులకు విముక్తి

Webdunia
చిన్నపిల్లలను అపహరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఐదుగురు భారతీయులు విడుదలయ్యారు. నేరం ఆరోపించబడిన వ్యక్తులందరూ పర్యాటకులని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు వారిని విడిచిపెట్టారు. కాగా... నిందితులపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారాలని తేలడంతో వారిని విడిచిపెట్టామని నేపాల్ పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే... నేపాల్‌లోని తినహు జిల్లాకు చెందిన బందీపూర్ పట్టణంలో పిల్లలను ఫొటో తీస్తున్న ఐదుగురు భారతీయ యువకులను అక్కడి స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పిల్లలను అపహరించేందుకు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నామని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దిశగా విచారణ చేపట్టిన పోలీసులకు ఆ యువకులందరూ పర్యాటకులేనని తెలియవచ్చింది. దీంతో వారిని విడిచిపెట్టేశారు. అరెస్టయిన వారందరూ చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు కాగా... వీరిలో రచిత్ కుమార్ శెట్టి (28), అశోక్ యాదవ్ (32), సురేంద్ర కుమార్ పాండే (32), చంద్రశేఖర్ వర్మ (32), రమేశ్ కుమార్ (40)లు ఉన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments