Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్‌ప్రీత్‌పై జరిగిన దాడి అబద్ధం: ఆస్ట్రేలియా

Webdunia
FILE
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై పెట్రోలుపోసి దాడికి పాల్పడినట్లు ప్రవాస భారతీయ యువకుడు జస్‌ప్రీత్ సింగ్ (29) అబద్ధం చెప్పినట్లు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. ఇది ఏ మాత్రం జాత్యహంకార దాడి కాదనీ, ఇన్య్సూరెన్స్ డబ్బుల కోసం జస్‌ప్రీత్ తన కారుకు తానే నిప్పంటించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

విచారణలో ఈ విషయాలన్నింటినీ ఒప్పుకున్న జస్‌ప్రీత్‌పై కుట్రపూరితంగా ఇన్స్యూరెన్స్ డబ్బులు రాబట్టుకున్నాడంటూ అభియోగాలు మోపామనీ, వచ్చే నెలలో విచారణ నిమిత్తం అతడిని మెల్‌బోర్న్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. ఈ మేరకు ఆసీస్ పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియాలో తాజాగా పలు కథనాలు వెలువడ్డాయి.

ఇదిలా ఉంటే.. జనవరి 8వ తేదీన తనపై కొంతమంది దుండగులు పెట్రోలు పోసి, వాహనానికి నిప్పంటించి పారిపోయినట్లు జస్‌ప్రీత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వారం రోజులముందే నితిన్ గార్గ్ అనే విద్యార్థి ఆసీస్‌లో దారుణ హత్యకు గురయిన నేపథ్యంలో సింగ్ ఆరోపణలు మీడియాలో ప్రముఖంగా రావటంతో, భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఈ అంశంపై ఆసీస్ పోలీసులు విచారణను వేగం చేయగా.. సింగ్ భాగోతం బయటపడింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments