Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్వాల్‌పై పిటీషన్‌: సుప్రీం ధర్మాసనం తిరస్కారం..!!

Webdunia
FILE
ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త శాంత్ సింగ్ ఛత్వాల్‌ను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఛత్వాల్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర పాత్రికేయుడు ఎస్ కే షా వేసిన పిటీషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టీస్ మదన్ బీ లోకుర్ తిరస్కరించారు.

ఇదిలా ఉంటే.. సరైన నిబంధనలు పాటించకుండా ఛత్వాల్‌కు పద్మభూషన్ అవార్డును ప్రకటించారని పేర్కొంటూ, షా మార్చి 23న ఢిల్లీ హైకోర్టులో తన న్యాయవాది ఎస్సీ మెహతా ద్వారా పిటీషన్ దాఖలు చేశారు. వివిధ కేసులలో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిని, భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారానికి ఎలా ఎంపిక చేస్తారని తన పిటీషన్‌లో షా ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకునేలా చేయాలని న్యాయస్థానానికి షా విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బీ లోకుర్ సారధ్యంలోని బెంచ్ అంగీకరించలేదు. ఛత్వాల్‌ ఎంపికకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ముందుగానే అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీపీ మల్హొత్రాకు అందజేశారు. అయితే వాటిలో ఛత్వాల్‌పై ఆరోపించిన విషయాల్లో ఆధారాలు సరిగా లేవనీ, అవార్డు ఎంపికలో పొరపాట్లు లేనట్లు గుర్తించటంతో విచారణకు బెంచ్ విచారణకు తిరస్కరించింది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments